జగన్ ఆస్తులపై కాంగ్రెసు కొలికి, న్యాయవాదులతో అఫిడవిట్ స్టడీ

YS Jagan
హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నేత, కడప లోకసభ సీటు అభ్యర్థి వైయస్ జగన్ ఆస్తుల్లో లొసుగులను పట్టుకునేందుకు కాంగ్రెసు పార్టీ ప్రయత్నాలు ప్రారంభించింది. లోకసభ సీటుకు నామినేషన్ వేసినప్పుడు జగన్ సమర్పించిన అఫిడవిట్ ఆధారంగా ఆ ప్రయత్నాలు మొదలు పెట్టింది. జగన్ ఎన్నికల సంఘానికి సమర్పించిన అఫిడవిట్‌పై అధ్యయనం చేసేందుకు కాంగ్రెసు పార్టీ నాయకత్వం ముగ్గురు హైకోర్టు న్యాయవాదులను నియోగించింది. దీనిపై కాంగ్రెసు కడప అభ్యర్థి డిఎల్ రవీంద్రా రెడ్డితో పాటు ముగ్గురు రాష్ట్ర మంత్రులు కడపలో విస్తృతంగా చర్చలు జరుపుతున్నారు.

అఫడవిట్‌లో వైయస్ జగన్ చూపించని ఆస్తులు ఏం ఉన్నాయనేది వెలికి తీయాలనేది కాంగ్రెసు నాయకత్వం ఆలోచన. జగన్‌కు అఫిడవిట్‌లో చూపించని ఆస్తులు చాలా ఉన్నాయని, బెంగుళూర్ ఇల్లు వంటివాటి ఆస్తులు తనవి కావని జగన్ చెప్పగలరా అని తెలుగుదేశం పార్లమెంటు సభ్యుడు నామా నాగేశ్వర రావు ధ్వజమెత్తిన నేపథ్యంలో జగన్ బినామీ ఆస్తులపై కాంగ్రెసు నాయకత్వంపై కాంగ్రెసు దృష్టి సారించినట్లు సమాచారం. వాటిని బయట పెట్టడం ద్వారా కడప ఉప ఎన్నికలో లబ్ధి పొందాలని కాంగ్రెసు భావిస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+