తిరిగొస్తాం, వేటు వేయకండి: కాంగ్రెసుకు జగన్ వర్గం ఎమ్మెల్యేల వినతి
శ్రీనివాసులు కాంగ్రెసులో ఉండాలా, జగన్తో ఉండాలా అనే విషయంపై ఎటూ తేల్చుకోలేక పోతున్నారు. దీంతో అలాంటి వారిని సాధ్యమైనంత తొందరగా తమ వైపుకు తిప్పుకోవాలనే యోచనలో పార్టీ ఉన్నట్టుగా తెలుస్తోంది. అందుకే హుటాహుటినా శ్రీకాంత్ రెడ్డి, శ్రీనివాసులును హైదరాబాదుకు రప్పించి వారితో మల్లుభట్టి సమావేశం అయినట్లుగా తెలుస్తోంది. సాయంత్రంలోగా కాంగ్రెసులోనికి తిరిగి వస్తున్నట్లుగా ప్రకటించాలని వారిని పార్టీ అదేశిస్తున్నట్లుగా తెలుస్తోంది. బుధవారం పార్టీ ఉప సభాపతి నాదెండ్ల మనోహర్కు జగన్ వర్గం ఎమ్మెల్యేలపై ఫిర్యాదు చేయనున్నట్లు వార్తలు వచ్చాయి.
ఈ నేపథ్యంలో వారిపై ఫిర్యాదు చేయకూడదంటే వారు తాము కాంగ్రెసులోనే ఉంటున్నట్లు ప్రకటించాలని చెప్పినట్లుగా తెలుస్తోంది. ఇందుకోసమే మల్లుభట్టి వారితో భేటీ అయినట్లుగా సమాచారం. అయితే వారు సమయం తీసుకుంటామని చెప్పినప్పటికీ అందుకు పార్టీ నేతలు ఒప్పుకోవడం లేదని తెలుస్తోంది. పార్టీలో ఉంటారా, జగన్తో వెళతారా అనే విషయంపై ఈరోజు బహిరంగంగా ప్రకటిస్తేనే ఫిర్యాదుపై వెనక్కి తగ్గుతామని చెప్పినట్లుగా తెలుస్తోంది. తమపై ఫిర్యాదును తప్పించుకోవడానికి కమలమ్మ బాటలోనే శ్రీనివాసులు, శ్రీకాంత్ రెడ్డి పయనించనున్నారని, ఈ విషయంపై సాయంత్రంలోగా ప్రకటన చేయనున్నట్లుగా తెలుస్తోంది.