వైయస్ జగన్ ముఖ్యమంత్రి అయ్యే అవకాశాలు లేవు: చంద్రబాబు
కాంగ్రెసు, తెలుగుదేశం పార్టీలు గెలుపొందడానికి డబ్బులు పంచుతున్నాయని ఆరోపించారు. రాష్ట్రంలో పేదలకు ఒక్క ఇల్లు కూడా లేదా కానీ జగన్కు మాత్రం ఊరూరా కోట్లాది రూపాయల విలువ చేసే ఇళ్లు ఉన్నాయని ఆరోపించారు. బిజెపితో పొత్తు ఉంటుందని చెప్పకనే చెప్పారని అన్నారు. కర్ణాటక మంత్రి గాలి జనార్ధన్ రెడ్డితో సంబంధాలు పెట్టుకొని బిజెపితో లాలూచి పడుతున్నారని ఆరోపించారు.
కాంగ్రెసు పార్టీ పనికి రాని పార్టీ అని ఆయన దుయ్యబట్టారు. అసమర్థ కాంగ్రెసు పార్టీ, అవినీతి జగన్కు ఓటు వేయవద్దని ఆయన ఓటర్లకు పిలుపునిచ్చారు. ఈ ఎన్నికలు నీతికి - అవినీతికి మధ్యనే పోరు అని చెప్పారు. కడప పార్లమెంటు నుండి మైసూరారెడ్డిని, పులివెందుల నుండి బిటెక్ రవిని ఓటర్లు తప్పకుండా గెలిపిస్తారని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
Comments
chandrababu naidu ys jagan Pulivendula kadapa చంద్రబాబునాయుడు వైయస్ జగన్ బిజెపి కాంగ్రెసు పులివెందుల కడప
English summary
TDP president Chandrababu Naidu blamed today Ex MP YS Jagan and Congress party in his campaign at Jammalamadugu. He urged voters to vote Telugudesam.
Story first published: Thursday, April 28, 2011, 14:02 [IST]