ఇదీ విషయం: నాదెండ్లకు వైయస్ జగన్ వర్గం ఎమ్మెల్యేల వివరణ

కొండా సురేఖ పంపిన సమాధానంలో మరో విషయాన్ని కూడా ప్రస్తావించారు. ఎమ్మెల్యేలకు అనర్హత నోటీసులు జారీ చేసే అధికారం ఉపసభాపతికి లేదని చెప్పారు. అధికారం లేకున్నప్పటికీ తమకు నోటీసులు జారీ చేయడం ఏమిటని ఆమె ప్రశ్నించారు. కేవలం స్పీకరు కార్యాలయానికి ఉన్న అధికారాల గురించే రాజ్యాంగం పదోషెడ్యూలు చెప్పిందని, తనకు లేని అధికారాలు ఉపయోగించి నాదెండ్ల నోటీసులు జారీ చేశారని చెప్పారు.
కాగా స్పీకరును కలిసి వచ్చిన అనంతరం ఆదినారాయణ రెడ్డి విలేకరులతో మాట్లాడారు. ప్రభుత్వాన్ని పడగొడతానని చేసిన జగన్ సవాల్కు చిరంజీవి స్పందన ఓ స్పందనే కాదన్నారు. స్పీకరుకు వివరణ ఇవ్వడానికి తమకు మంగళవారం వరకు అవకాశముందని చెప్పారు. అప్పటి వరకు పూర్తి వివరణ ఇస్తామని చెప్పారు.












Click it and Unblock the Notifications