వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అవినీతి వైయస్ జగన్‌ను, అసమర్థ కాంగ్రెసును ఓడించండి: చంద్రబాబు

By Pratap
|
Google Oneindia TeluguNews

Chandrababu Naidu
హైదరాబాద్: కడప ఉప ఎన్నికలో అవినీతి వైయస్ జగన్‌ను, అసమర్థ కాంగ్రెసును ఓడించాలని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. వైయస్ జగన్ అవినీతి వ్యవహారాలు జుగుప్సాకరంగా ఉన్నాయని ఆయన మంగళవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో వ్యాఖ్యానించారు. అవినీతి సొమ్మును జగన్ ఎన్నికల్లో ఖర్చు చేస్తున్నారని, జగన్‌తో బిజెపి లాలూచీ పడుతోందని ఆయన అన్నారు. రాష్ట్రంలోని భూములను అప్పనంగా దోచుకున్నారని ఆయన ఆరోపించారు. రాజకీయాలను కలుషితం చేస్తున్నారని, వీటి గురించి ప్రజలు ఆలోచించాలని ఆయన అన్నారు. జగన్‌కు ప్రజలే బుద్ది చెప్తారని ఆయన అన్నారు.

మజ్లీస్ శాసనసభ్యుడు అక్బరుద్దీన్ ఓవైసీపై దాడిని ఆయన ఖండించారు. రాష్ట్రంలో వరుసగా హత్యలు జరుగుతున్నాయని, వీటిని చూస్తుంటే రాష్ట్రంలో ప్రభుత్వం ఉందా అనే అనుమానాలు కలుగుతున్నాయని ఆయన అన్నారు. తమ పార్టీ శాసనసభ్యుడు పరిటాల రవి హత్య నుంచి వరుసగా హత్యలు జరుగుతున్నాయని ఆయన అన్నారు. మద్దెలచెర్వు సూరి హత్య కేసులో ప్రధాన నిందితుడు భాను కిరణ్‌ను పట్టుకోలేకపోయారని ఆయన అన్నారు. వైయస్ హయాంలో ఖజానా ఖాళీ అయిందని, తాము ముఠా సంస్కృతికి వ్యతిరేకమని ఆయన చెప్పారు. తమ ప్రభుత్వ హయాంలో ప్రజలను ఆదుకున్నామని ఆయన చెప్పారు.

English summary
TDP president N Chandrababu Naidu appealed to the voters to defeat corrupt YS Jagan. He said that public will will give fitting reply to YS Jagan.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X