హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

చిరంజీవి చీట్ చేశాడు, అందుకే జగన్ పార్టీలో చేరా: పోసాని

By Srinivas
|
Google Oneindia TeluguNews

Posani Krishna Murali
హైదరాబాద్: ప్రజారాజ్యం పార్టీ అధ్యక్షుడు చిరంజీవి తన పార్టీకి ఓటు వేసిన ఓటర్లను మోసం చేశారని ప్రముఖ సినీ రచయిత పోసాని కృష్ణ మురళి మంగళవారం అన్నారు. సామాజిక న్యాయం పేరుతో పార్టీని స్థాపించి గత సాధారణ ఎన్నికల్లో సీట్లు గెలిచి ఇప్పుడు కాంగ్రెసులో తన పార్టీని విలీనం చేయడం దురదృష్టకరమన్నారు. అలా చేయడం ప్రజలను మోసం చేసినట్లే అన్నారు. ఇప్పుడున్న పార్టీలలో కెల్లా మాజీ పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి స్థాపించిన వైయస్ఆర్ కాంగ్రెసు పార్టీయే మంచిదన్నారు. అందుకే ఆయన పార్టీలో చేరానని చెప్పారు.

దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖరరెడ్డి ఆశయాలకు అనుగుణంగా జగన్ పని చేసినన్నాళ్లూ ఆయన వెంటే తాను ఉంటానని చెప్పారు. జగన్‌ను ప్రజలు బాగా ఆదరిస్తున్నారన్నారు. కడప, పులివెందులలో జగన్ తప్పకుండా గెలుస్తాడని చెప్పారు.

English summary
Posani Krishna Murali blamed PRP president Chiranjeevi for merger of PRP in Congress. He accused that Chiranjeevi cheated public.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X