కరుణానిధికి తిరుగులేని దెబ్బ, జయలలిత విజయ కేతనం

2జి అవినీతి కుంభకోణంలో ఇరుక్కు పోయిన డిఎంకె పార్టీపై తమిళ ప్రజలు విశ్వాసం కోల్పోయారు. అందుకే అన్నాడిఎంకెకు పట్టం గట్టారు. తమిళనాడు రాజధాని అయిన చెన్నైలో కూడా డిఎంకె పార్టీ పట్టు కోల్పోయింది. రాజధాని నగరంలో కేవలం మూడు స్థానాల్లో మాత్రమే గెలుపొందింది. దక్షిణ చెన్నైలో అయితే పూర్తిగా తుడిచి పెట్టుకు పోయింది. అంబాసముద్రం నుండి సభాపతి అపుడయప్పన్ ఓడిపోయారు. కరుణానిధి 50వేల ఆధిక్యంతో అన్నాడిఎంకె అభ్యర్థిపై తిరువానూర్ నుండి గెలుపొందారు. అయితే డిఎంకె పార్టీలోని పలువురు మంత్రులు ఓటమి బాటలో పయనిస్తున్నారు. డిఎంకె భారీ ఓటమిని జీర్ణించుకోలేని కలైంజ్ఞర్ టీవి ఎన్నికల ఫలితాల ప్రత్యక్ష ప్రసారాలను నిలిపి వేసింది.
తమిళనాడులో మిత్రపక్షాలతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని జయలలిత ప్రకటించారు. డబ్బులతో గెలవాలని అనుకున్న డిఎంకె పార్టీకి తమిళ ఓటర్లు గట్టి బుద్ది చెప్పారన్నారు. డిఎంకే ప్రభుత్వంలో నాశనమైన తమిళనాడును తాను పునర్నిర్మిస్తానని చెప్పారు. తమ పార్జీ విజయం డిఎంకె పట్ల ప్రజల్లో ఉన్న వ్యతిరేకతకు నిదర్శనం అన్నారు. కాగా తమిళనాడు విషయంలో ఎగ్జిట్ పోల్ ఫలితాలు తప్పని తేలింది. డిఎంకె, అన్నాడిఎంకె కూటమి మధ్య హోరా హోరీ ఉంటుందని పోల్స్ చెప్పినప్పటికీ అన్నాడిఎంకె క్లీన్ స్వీప్ చేయడం విశేషం.












Click it and Unblock the Notifications