పులివెందులలో వైయస్ విజయమ్మ రికార్డు, 85 వేల మెజారిటీ

YS Vijayamma
కడప: పులివెందుల శాసనసభా నియోజకవర్గంలో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అభ్యర్థి వైయస్ విజయమ్మ భారీ మెజారిటీతో విజయం సాధించారు. పులివెందులలో వదినా, మరిది పోటీలో వదినే విజయం సాధించారు. కాంగ్రెసు అభ్యర్థి వైయస్ వివేకానంద రెడ్డిపై విజయమ్మ 85 వేల 191 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. పులివెందుల అసెంబ్లీ చరిత్రలో ఇదే అత్యధిక మెజారిటీ. తన భర్త వైయస్ రాజశేఖర రెడ్డిని మెజారిటీలో విజయమ్మ అధిగమించారు.

వైయస్ విజయమ్మకు లక్షా 14 వేల 198 ఓట్లు పోలయ్యాయి. వైయస్ వివేకానంద రెడ్డి రెండో స్థానంలో నిలిచి కాస్తా పరువు దక్కించుకున్నారు. ఆయనకు 28 వేల 626 ఓట్లు వచ్చాయి. కాగా, తెలుగుదేశం పార్టీ అభ్యర్థి బిటెక్ రవి మూడో స్థానంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఆయనకు 11 వేల 552 ఓట్లు మాత్రమే వచ్చాయి. ఇద్దరికి పోలైన ఓట్లను కలిపినా విజయమ్మ మెజారిటీతో సమానం కావడం లేదు. విజయమ్మ విజయంతో సానుభూతి విజయం సాధించిందని చెప్పవచ్చు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+