కెసిఆర్ కిలాడి మాటలు మాను, ఇమేజ్ కోసమే జగన్ దీక్షలు: పొంగులేటి

Ponguleti Sudhakar Reddy
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కె చంద్రశేఖరరావు కిలాడి మాటలు మానుకోవాలని కాంగ్రెసు సీనియర్ నాయకుడు, శాసనమండలి సభ్యుడు పొంగులేటి సుధాకర్ రెడ్డి ఆదివారం హెచ్చరించారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు ఆలస్యం కావడానికి కెసిఆర్ కారణమని ఆరోపించారు. కెసిఆర్ వైఖరి వల్లే తెలంగాణ ఆలస్యం అవుతుందన్నారు. ఉద్యమాలకు వెల కట్టగలిగిన నాయకుడు కేవలం కెసిఆర్ ఒక్కరే అన్నారు. కెసిఆర్ తన అహంకార ధోరణి మానుకోవాలని సూచించారు.

తెలుగుదేశం పార్టీ, కాంగ్రెసు పార్టీ మ్యాచ్ ఫిక్సింగ్ అంటూ వైయస్ఆర్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి నిరాధార ఆరోపణలు చేస్తున్నారు. ప్రజలను పక్కదారి పట్టించడానికే ఆయన ప్రయత్నాలు అన్నారు. గతంలో పార్లమెంటులో టిడిపితో కలిసి ప్లకార్డులు పట్టుకున్న జగన్ టిడిపి మైత్రిపై మొదట సమాధానం చెప్పాలన్నారు. కడప ఉప ఎన్నికలలో గెలుపుతో జగన్ అహంభావిగా మాట్లాడుతున్నారన్నారు. కడప, పులివెందులలో ఓటమిపై కేంద్రమంత్రి, రాష్ట్రవ్యవహారాల ఇంఛార్జ్ గులాం నబీ ఆజాద్‌తో చర్చిస్తామని చెప్పారు. మా అభిప్రాయాలు ఆయనకు తెలియజేస్తామని చెప్పారు. రైతుల గిట్టుబాటు ధరలపై తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు రాజకీయా చేస్తున్నారన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+