రాజీనామకు సిద్ధపడిన వైయస్ జగన్ కోవర్టు పార్లమెంటు సభ్యుడు

M Venugopala Reddy
గుంటూరు: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ కోవర్టుగా తనపై ముద్ర వేయడంపై గుంటూరు జిల్లా నర్సారావుపేట తెలుగుదేశం పార్లమెంటు సభ్యుడు ఎం. వేణుగోపాల్ రెడ్డి తీవ్ర మనస్తాపానికి గురయ్యారు. కొందరు పార్టీ సీనియర్ నాయకులు తనపై జగన్ కోవర్టుగా చెప్పడంతో వేణుగోపాల్ రెడ్డి ఆదివారంనాడు పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడిని కలుసుకున్నారు. తాను పార్టీకి, లోకసభ సభ్యత్వానికి రాజీనామా చేస్తానని ఆయన చంద్రబాబుతో చెప్పినట్లు సమాచారం.

తనపై విశ్వాసం లేనప్పుడు పార్టీలో కొనసాగడంలో అర్థం లేదని పారిశ్రామికవేత్త, లోకసభ సభ్యుడు వేణుగోపాల్ రెడ్డి చంద్రబాబుతో అన్నట్లు తెలుస్తోంది. జగన్‌తో తాను సంప్రదింపులు జరుపుతున్నట్లు కొంత మంది తనపై ఆరోపణలు చేయడంపై ఆయన తీవ్ర అభ్యంతరం తెలిపారు. మాజీ మంత్రి ఒకరు, ఇతర నాయకులు కొంత మంది తనపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని ఆయన చెప్పినట్లు సమాచారం.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+