ఇతర ఏటీఎంలలో బ్యాలెన్స్ చెక్ చేస్తే డబ్బులు కట్టాల్సిందే...!

ఇవి కాకుండా బ్యాలెన్స్ ఎంక్వైరీ వంటి నాన్ ఫైనాన్షియల్ సేవలను కూడా ఈ అయిదు లావాదేవీల పరిధిలోకి తీసుకువచ్చారు. వినియోగదారులు అధికస్థాయిలో నాన్ ఫైనాన్షియల్ సేవలను వినియోగిస్తుండటంతో, వీటిని కట్టడి చేయడానికి ఆర్బీఐ ఈ నిర్ణయం తీసుకుంది. గత ఏప్రిల్ నెలలో మొత్తం ఏటీఎం లావాదేవీల్లో 28 శాతం వాటా బ్యాలెన్స్ ఎంక్వైరీ, మినిస్టేట్మెంట్ వంటివే ఉన్నాయి. ఈ మధ్యనే ఏటీఎంల లావాదేవీల్లో ఏవైనా పొరపాట్లు జరిగితే వాటిని వారం రోజుల్లో సరి చేయాలని లేకపోతే రోజుకు రూ.100లు చెల్లించాల్సి ఉంటుందని ఆర్బీఐ బ్యాంకులను ఆదేశించింది. ఈ నిర్ణయం కూడా జూలై1 నుంచి అమలులోకి రానుంది.












Click it and Unblock the Notifications