బొత్స సత్యనారాయణ వర్సెస్ కిరణ్ కుమార్ రెడ్డి, ప్రతి చోటా చెక్?

మంత్రి వర్గ సమావేశాల్లో పిసిసి అధ్యక్షుడిగా, మంత్రిగా బొత్స సత్యనారాయణ గొంతు పెంచే అవకాశాలున్నాయని అంటున్నారు. ఇప్పటికే వైయస్ జగన్ వెంట వెళ్తున్న శాసనసభ్యుల విషయంలో కఠినంగా వ్యవహరిస్తామని బొత్స సత్యనారాయణ బలంగానే చెప్పారు. బొత్స దూకుడును దృష్టిలో పెట్టుకునే కిరణ్ కుమార్ రెడ్డి శ్రీకాకుళం జిల్లా సభలో వైయస్ జగన్ వర్గానికి చెందిన శాసనసభ్యులపై తీవ్ర వ్యాఖ్యలు చేశారని అంటున్నారు. తమ పార్టీ నుంచి వెళ్లిపోవాలని, వారి అవసరం తమకు లేదని ఆయన హెచ్చరించారు. బొత్స సత్యనారాయణ ఆధిపత్యం వహిస్తారనే ఉద్దేశంతోనే కిరణ్ కుమార్ రెడ్డి అంతటి ఘాటు వ్యాఖ్యలు చేశారని అంటున్నారు. ఇరువురి మధ్య ఆధిపత్య పోరు కొనసాగే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయని చెబుతున్నారు.
కాంగ్రెసు పార్టీ రెడ్లపై ఆధారపడి ఉందనే అభిప్రాయం బలంగా ఉంది. ఇప్పుడు రెడ్లు వైయస్సార్ కాంగ్రెసు పార్టీలోకి వెళ్తారనే ప్రచారం జరుగుతోంది. ఈ స్థితిలో బిసీలను తమ వైపు తిప్పుకోవాలనే ఉద్దేశంతో కాంగ్రెసు అధిష్టానం ఉందని చెబుతున్నారు. ఇందులో భాగంగానే బొత్స సత్యనారాయణకు పిసిసి పదవి అప్పగించినట్లు చెబుతున్నారు. కాపు సామాజిక వర్గం బిసిల్లో ఆధిపత్య వర్గంగా కొనసాగుతోంది. ఈ వర్గానికి చెందిన బొత్స సత్యనారాయణ బీసీలను కూడగట్టడంలో ప్రధాన పాత్ర పోషిస్తారని అంటున్నారు. ఏమైనా, రాష్ట్ర కాంగ్రెసు రాజకీయాలు అనతి కాలంలోనే ఆసక్తికరమైన మలుపు తీసుకోవచ్చునని అంటున్నారు.












Click it and Unblock the Notifications