వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సోనియాకు బానిసలుగా పనిచేయవద్దు: కాంగ్రెసు నేతలకు నాగం హితవు

By Srinivas
|
Google Oneindia TeluguNews

Nagam Janardhan Reddy
మహబూబ్‌నగర్: తెలంగాణ ప్రాంత కాంగ్రెసు నేతలు ఏఐసిసి అధ్యక్షురాలు సోనియాగాంధీకి బానిసలుగా ఉండకుండా తెలంగాణ రాష్ట్ర సాధనకు చిత్తశుద్ధితో ఉద్యమం చేయాలని తెలుగుదేశం పార్టీ బహిష్కృత శాసనసభ్యుడు నాగం జనార్దన్ రెడ్డి శుక్రవారం సూచించారు. పార్టీలకు అతీతంగా తెలంగాణ కోసం ఉద్యమించాల్సిన సమయం వచ్చిందన్నారు. తాను తెలంగాణ కోసం చిత్తశుద్ధితో పని చేస్తున్నానని అన్నారు. తెలుగుదేశం పార్టీ కూడా స్పష్టమైన వైఖరితో తెలంగాణ రణభేరి సభలు నిర్వహించుకోవచ్చునని స్పష్టం చేశారు.

ఈ నెల 13వ తేదిన అదిలాబాదులో తెలంగాణ నగారా సభను ఏర్పాటు చేస్తున్నట్టు నాగం చెప్పారు. తెలంగాణ జెఏసికి మా మద్దతు ఉంటుందని చెప్పారు. తమ సభలకు కూడా జెఏసి మద్దతు ఇవ్వాలని తెలంగాణ రాజకీయ ఐక్య కార్యాచరణ సమితి చైర్మన్ కోదండరాంను కోరారు.

English summary
TDP suspended MLA Nagam Janardhan Reddy suggested T-Congress leaders to do not behave like slaves of AICC president Sonia Gandhi.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X