వైయస్ జగన్ వర్గం ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డితో నాగం చర్చలు

తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావు, తెలంగాణ జెఎసి చైర్మన్ కోదండరామ్ కూడా వైయస్ జగన్ వద్ద డబ్బులు తీసుకుని కుమ్మక్కయ్యారని ఆయన ఆరోపించారు. కాకతీయ విశ్వవిద్యాలయం విద్యార్థులపై జగన్ గుండాలు దాడి చేస్తే కెసిఆర్ గానీ కోదండరామ్ గానీ వారిని పరామర్సించడానికి ఆస్పత్రికి ఎందుకు వెళ్లలేదని ఆయన ప్రశ్నించారు. ఇతర పార్టీల నుంచి పదవుల కోసం వచ్చినవారే తెరాసలో ఉన్నారని, కొత్తవారెవరూ లేరని ఆయన అన్నారు. ఈ విషయాలన్నిటిపై తాము కరపత్రం విడుదల చేస్తామని ఆయన చెప్పారు. నాగం నిర్వహించిన తెలంగాణ నగారాలో పాల్గొన్న తమ పార్టీ శానససభ్యులు వేణుగోపాలాచారి, హరీశ్వర్ రెడ్డి, జోగు రామన్నలపై చర్యలు తీసుకునే విషయంపై చర్చించి నిర్ణయం తీసుకుంటామని ఆయన చెప్పారు.
తెలంగాణ విషయంలో కేంద్ర ప్రభుత్వం గూర్ఖాలాండ్ తరహా ప్యాకేజీని ప్రకటిస్తే అంగీకరించేది లేదని ఎర్రబెల్లి దయాకరరావు స్పష్టం చేశారు. గూర్ఖాలాండ్, తెలంగాణ ఉద్యమాలు వేరువేరని అన్నారు. తెలంగాణ ప్రజలు దీన్ని ఆత్మగౌరవ సమస్యగా భావిస్తున్నారని చెప్పారు.












Click it and Unblock the Notifications