జగన్ వెళ్లడం నష్టమే, వ్యక్తి గత ఉద్దేశంతోనే పార్టీ పెట్టాడు: బొత్స
దివంగత వైయస్ రాజశేఖరరెడ్డి మృతి తర్వాత కూడా ప్రభుత్వం సంక్షేమ పథకాలు కొనసాగిస్తుందన్నారు. పార్టీలో వ్యక్తులు ముఖ్యం కాదన్నారు. వ్యక్తులు ఉన్నా లేకున్నా కాంగ్రెసు పార్టీ తన పద్ధతిలో తాను వెళుతుందన్నారు. గతంలో రాష్ట్రాన్ని పాలించిన చంద్రబాబునాయుడు ఎన్టీఆర్ 2 రూపాయల కిలో బియ్యం పథకాన్ని తొలగించారన్నారు. ప్రజా సమస్యలను ముందుగా తెలుసుకొని పరిష్కరించే దిశగా పని చేస్తానని చెప్పారు. సంక్షేమ పథకాల అమలులో వెనుకడుగు వేయమన్నారు. వైయస్ హయాంలో భారీగా ఆర్థిక వనరులు ఉండేవని కానీ 2009 తర్వాత ఆర్థిక మాంద్యం కారణంగా ఆర్థిక వనరులు తగ్గాయన్నారు. పార్టీలో క్రమశిక్షణ ముఖ్యమన్నారు. పార్టీ నేతల మధ్య అపోహలు ఉండకూడదన్నారు. ప్రభుత్వానికి, ప్రజలకు, అధిష్టానానికి మధ్య సమన్వయకర్తగా పని చేస్తానని అన్నారు. వైయస్ మృతి తర్వాత రోశయ్య, ఇప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి బాగా పరిపాలిస్తున్నారన్నారు.