తిరుపతి: శ్రీవారి రేసు గుర్రం సిబ్బంది నిర్లక్ష్యానికి బలైంది. తిరుమల గోసంరక్షణ శాలలో అత్యంత విలువైన ఆ గుర్రం మరణించింది. గుర్రాలను వదిలిపెట్టిన సమయంలో అది ఇతర గుర్రాలతో సరసల్లాపాలు ప్రారంభించింది. ఆ సందర్భంలో ఓ రాయి తగిలి అది మరణించింది.
ఆ గుర్రాన్ని చైన్నై భక్తుడు జూన్ 6వ తేదీన తిరుమల శ్రీవెంకటేశ్వర స్వామికి బహూకరించాడు. దాని విలువ 75 లక్షల రూపాయలు ఉంటుంది.