అనంతపురం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

నోటీసులకు సమాధానం చెబుతాం, చట్టం తన పని తాను చేస్తుంది: రత్నాకర్

By Srinivas
|
Google Oneindia TeluguNews

Sathya Sai Baba
అనంతపురం: లీగల్ నోటీసులకు సత్యసాయి ట్రస్టు సమాధానం చెబుతుందని సత్యసాయి సెంట్రల్ ట్రస్టు సభ్యుడు, భగవాన్ శ్రీ సత్యసాయిబాబా సోదరుడి తనయుడు రత్నాకర్ గురువారం విలేకరులతో మాట్లాడుతూ చెప్పారు. రత్నాకర్ పెనుగొండ డిఎస్పీ కార్యాలయంలో గురువారం విచారణకు హాజరయ్యారు. అనంతరం ఆయన కోర్టులో హాజరయ్యే అవకాశం కూడా ఉంది. ట్రస్టుపై వస్తున్న ఆరోపణల నేపథ్యంలో పోలీసులు విచారణ వేగవంతం చేశారు. కాగా పెనుగొండ డిఎస్పీ కార్యాలయం నుండి బయటకు వచ్చిన విలేకరులతో మాట్లాడారు.

చట్టం తన పని తాను చేసుకు పోతుందని అన్నారు. కాగా ఎల్లుండి లోగా ఆస్తులు వెల్లడించాలని పోలీసులు ఆదేశాలు జారీ చేశారని చెప్పారు. తాము అందుకు సుముఖంగా ఉన్నట్టు చెప్పారు. పోలీసులకు, ప్రభుత్వానికి అన్ని వివరాలు అందిస్తామని ఆయన చెప్పారు. లీగల్ నోటీసులకు కూడా సమాధానం చెబుతామని అన్నారు. కాగా భక్తులు ట్రస్టుపై వస్తున్న వార్తలపై ఎలాంటి అనుమానాలు పెట్టుకోవద్దని ఆయన సూచించారు. భక్తుల అనుమానాలు నివృత్తి చేస్తామని అన్నారు.

English summary
Sathya Sai Trust member Ratnakar attended to enquiry at Penugonda SP today. He talk with media after that. He said they will ready to answer government notice.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X