నిధుల వివరాలు రహస్యంగా ఉంచాలన్న సుప్రీంకోర్టు

Supreme Court
తిరువనంతపురం: కేరళ రాష్ట్రంలోని ప్రముఖ అనంతపద్మనాభ స్వామి ఆలయంలో బయటపడ్డ సంపదపై సుప్రీం కోర్టు జోక్యం చేసుకుంది. ఆలయంలో బయటపడుతున్న లక్షల కోట్ల సంపదపై ట్రావెన్ కోర్ రాజవంశీయులు సుప్రీం కోర్టును ఆశ్రయించారు. బయటపడుతున్న నిధి నిక్షేపాలను రహస్యంగా ఉంచాలని వారు విజ్ఞప్తి చేశారు. దీనికి స్పందించిన కోర్టు ఆలయంలో దొరుకుతున్న సంపదను వీడియో ద్వారా చిత్రీకరించాలని ప్యానెల్‌ను ఆదేశించింది. ఆలయ సంపదపై, ఇతర విషయాలపై ప్యానెల్ అధికారులు మీడియాతో మాట్లాడవద్దని ఆదేశాలు జారీ చేసింది.

ఆలయ సంపదను పర్యవేక్షించడానికి ఓ ప్రత్యేక అధికారిని కూడా నియమించాలని కోర్టు ప్యానెల్‌ను ఆదేశించింది. నేలమాళిగలో దొరిగిన ఆస్తిలో వేటిని మ్యూజియంలో ఉంచాలి, వేటిని భద్రపర్చాలనే విషయం కోర్టు నిర్ణయం తీసుకుంటుందని చెప్పారు. శుక్రవారం ఆ నిర్ణయం వెలువడుతుందని చెప్పారు. ఆలయంలో దొరికిన సంపందపై ఎవరు యాజమాన్యానికి డిమాండ్ చేసినా తీవ్రంగా పరిగణిస్తామని కోర్టు హెచ్చరికలు జారీ చేసింది. కాగా నూటా యాభై సంవత్సరాల క్రితం ట్రావెన్ కోర్ సంస్థానాధిపతులు నేలమాళిగళ్లలో ఈ నిధులను భద్రపరిచినట్లుగా తెలుస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+