టిడిపితో కలిసి వెళతాం, బస్సు యాత్రకు ఓకే: కోదండరామ్

తెలంగాణ ప్రజాప్రతినిధులతో సమావేశం తరువాత ఉద్యమ కార్యాచరణ ప్రకటిస్తామని తెలిపారు. రాజీనామాల కారణంగానే కేంద్రంలో కదలిక మొదలైందని అన్నారు. తెలంగాణ ప్రాంత నేతలు పార్టీలకతీతంగా రాజీనామాలు చేసి కేంద్రంలో కదలిక తీసుకు రావడం మంచి విషయం అన్నారు. ఐక్య వేదిక ప్రతిపాదనపై అన్ని సంఘాలు సానుకూలంగా స్పందించాయని చెప్పారు. ఉమ్మడి కార్యాచరణలో రాజీనామా చేసిన నేతలంతా పార్టీలకతీతంగా పాల్గొంటారన్నారు. రాజీనామా చేయని వారిని కలుపుకొని వెళ్లే ప్రసక్తి లేదన్నారు. సీమాంధ్ర నేతలు తెలంగాణకు వ్యతిరేకంగా ఎవరైనా మాట్లాడితే ఊరుకునేది లేదన్నారు. రాజీనామా చేసిన నేతలను ఢిల్లీకి తీసుకు వెళ్లి పరేడ్ చేయించాలనే యోచనలో ఉన్నట్లు చెప్పినట్లుగా తెలుస్తోంది.












Click it and Unblock the Notifications