కోదండరామ్కు కాంగ్రెసు ఎమ్మెల్యే దామోదర్ రెడ్డి షాక్

తెలుగుదేశం పార్టీ తెలంగాణ ప్రాంత నాయకులు బస్సు యాత్ర చేపట్టినట్లుగానే తాము విడిగా కార్యక్రమం చేపట్టే విషయంపై ఆలోచన చేస్తామని ఆయన అన్నారు. తెలంగాణ ఇచ్చేది, తెచ్చేది తామే కాబట్టి తమపై బాధ్యత ఎక్కువ ఉంటుందని, అందువల్ల భవిష్యత్తు కార్యాచరణపై వేచి చూస్తున్నామని ఆయన అన్నారు. సమస్య జఠిలమైంది కాబట్టి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి చొరవ తీసుకుని తెలంగాణకు అనుకూలంగా పార్టీ సీమాంధ్ర నాయకులను ఒప్పించాలని ఆయన అన్నారు. అయితే, సీమాంధ్ర నేతలతో తాము సమావేశమయ్యే పరిస్థితి లేదని ఆయన స్పష్టం చేశారు. తాము ఎవరితోనూ కలిసి సమావేశం నిర్వహించబోమని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications