సీమాంధ్ర సీనియర్ నేతలకు చంద్రబాబు క్లాస్
తమ బస్సు యాత్రకు చంద్రబాబు అనుమతించారని, చంద్రబాబు తెలంగాణకు వ్యతిరేకం కాదని చెబుతూ బస్సు యాత్రలో తెలంగాణ నాయకులు ఊదరగొడుతున్నారు. ఈ స్థితిలో సీమాంధ్ర నాయకులు తెలంగాణను వ్యతిరేకిస్తూ పాదయాత్రలు, ప్రకటనలు చేయడం వల్ల ఇబ్బందులు వస్తున్నాయి. సీమాంధ్ర నాయకులకు కూడా చంద్రబాబు అనుమతి ఉందా, ఇటు తెలంగాణ నాయకులను, అటు సీమాంధ్ర నాయకులను ప్రోత్సహించి తన రెండు కళ్ల సిద్ధాంతాన్ని బయటపెట్టుకుంటున్నారని ఇతర పార్టీల నుంచి ఇప్పటికే విమర్శలు వస్తున్నాయి. ఉనికి కోల్పోయి ప్రమాదంలో పడిన పార్టీని బస్సు యాత్ర ద్వారా తెలంగాణ నాయకులు కాపాడే ప్రయత్నం చేస్తున్నారు. ఈ స్థితిలో సీమాంధ్ర నాయకులు సమైక్యాంధ్ర కోసం ముందుకు వస్తే తెలంగాణలో మళ్లీ కష్టాలు మొదలపుతాయని ఆయన చెప్పినట్లు సమాచారం.
Comments
chandrababu naidu telugudesam telangana seemandhra hyderabad చంద్రబాబు నాయుడు తెలుగుదేశం తెలంగాణ సీమాంధ్ర హైదరాబాద్
English summary
It is said that TDP president Chandrababu Naidu has warned Seemandhra leaders for making statements for united Andhra.
Story first published: Monday, July 11, 2011, 8:25 [IST]