రగులుతున్న సీమాంద్ర, రాజీనామాలకు నేతలు దూరం

Andhra Pradesh
విజయవాడ: సమైక్యాంధ్రకు అనుకూలంగా సీమాంధ్రలో ఆందోళనలు ఉధృతమవుతున్నాయి. రాష్టాన్ని సమైక్యాంగా ఉంచుతామని ప్రకటించాలని డిమాండ్ చేస్తూ విద్యార్థులు ఆందోళనకు దిగుతున్నారు. ఆంధ్ర, ఎస్వీ, పద్మావతి, నాగార్జున విశ్వవిద్యాలయాల్లో విద్యార్థులు వివిధ రూపాల్లో ఆందోళనలకు దిగుతున్నారు. సోమవారంనాటికి ఆ ఆందోళనలు ఉధృతమయ్యాయి. మంత్రులు, రాజకీయ నాయకుల ఇళ్లను ముట్టడిస్తున్నారు. సీమాంధ్ర ప్రాంతానికి వచ్చిన నేతలను అడ్డుకుంటున్నారు. తాజాగా, మంత్రి రఘువీరా రెడ్డిని ఆందోళనకారులు అడ్డుకున్నారు. గుంటూరులో ఇటీవల మంత్రి మాణిక్యవరప్రసాద్ ఇంటిని ముట్టడించారు. ప్రజాప్రతినిధులు రాజీనామాలు చేయాలని డిమాండ్ చేస్తూ ఇళ్ల ముట్టడి కార్యక్రమాన్ని చేపట్టారు. పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణకు చేదు అనుభవం ఎదురైంది.

విజయవాడ, గుంటూరు, విశాఖపట్నం, తిరుపతి వంటి నగరాల్లో ఆందోళనలు ఉధృతమవుతున్నాయి. అయితే రాజీనామాల వల్ల సమస్య పరిష్కారం కాదని సీమాంధ్ర నాయకులు చెబుతున్నారు. 2009 డిసెంబర్ 9వ తేదీన తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ప్రక్రియను ప్రారంభిస్తున్నట్లు కేంద్ర హోం మంత్రి పి. చిదంబరం ప్రకటించగానే సీమాంధ్ర ప్రజాప్రతినిధులు రాజీనామాలకు దిగారు. సీమాంధ్ర ప్రజాప్రతినిధులు రాజీనామాలు చేస్తారని కాంగ్రెసు సీనియర్ శాసనసభ్యుడు జెసి దివాకర్ రెడ్డి ప్రకటించినప్పటికీ రాజీనామాలకు కాంగ్రెసు సీమాంధ్ర ప్రజా ప్రతినిధులు దూరంగా ఉండదలిచినట్లు తెలుస్తోంది.

తాము రాజీనామాలు చేయబోమని మంత్రులు డిఎల్ రవీంద్రా రెడ్డి , ఎరాసు ప్రతాప రెడ్డి వంటివారు ఇప్పటికే ప్రకటించారు. రాజీనామాల వల్ల సమస్య పరిష్కారం కాదని మంత్రి మాణిక్యవరప్రసాద్ అన్నారు. రాజీనామాలు అవసరం లేదని విజయవాడ పార్లమెంటు సభ్యుడు లగడపాటి రాజగోపాల్ అభిప్రాయపడ్డారు. గతంలో మొదట రాజీనామా చేసిన ప్రజాప్రతినిధి ఆయనే. అయితే, తెలంగాణ రాదని ఆయన గట్టిగా నమ్ముతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+