ఆంధ్ర ఎంపీలు అంతే: ఆఖరి పునర్వ్యస్థీకరణన్న పిఎం

వివిధ రాష్ట్రాల మధ్య సమతూకాన్ని, సామర్థ్యాన్ని, కొనసాగింపును పరిగణనలోకి తీసుకుని పునర్వ్యస్థీకరణ చేసినట్లు ఆయన తెలిపారు. తనకు సంబంధించినంత వరకు ఎన్నికలకు ముందు మళ్లీ మంత్రివర్గంలో మార్పులు ఉండవని ఆయన అన్నారు. పునర్వ్యస్థీకరణ జరిగిన తర్వాత కొంత మంది మంత్రుల్లో శాఖలపై అసంతృప్తి ఉండడం సహజమి, దేశ ప్రయోజనాలను పరిగణనలోకి తీసుకున్నామని ఆయన అన్నారు. డిఎంకె నుంచి త్వరలో రెండు మంత్రి పదవుల కోసం సూచనలు వస్తాయని భావిస్తున్నట్లు ఆయన తెలిపారు. రాహుల్ గాంధీ పార్టీ పనిలో బిజీగా ఉన్నారని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications