వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అంతా చూస్తుండగా ఓ వ్యక్తిని కొట్టి చంపారు

By Pratap
|
Google Oneindia TeluguNews

Man beaten to death in Coimbatore
కోయంబత్తూర్: నగరజీవులు పూర్తి యాంత్రికంగా మారిపోయారని చెప్పడానికి ఓ ఘాతుకమైన సంఘటన చోటు చేసుకుంది. తామంతా చూస్తుండగానే ఓ వ్యక్తిని గుండాలు పట్టపగలు హత్య చేశారు. మోటార్ సైకిల్‌పై వెళ్తున్న ఓ వ్యక్తిని అందరూ చూస్తుండగానే కొట్టి చంపారు. ఈ సంఘటన తమిళనాడులోని కోయంబత్తూర్‌లో ఆదివారం జరిగింది. ఈ సంఘటన ట్రాఫిక్ జంక్షన్‌లో ఏర్పాటు చేసిన సిసిటివీలో రికార్డు అయింది. దాంతో పోలీసులు నలుగురు దుండగులను అరెస్టు చేశారు.

ఇద్దరు వ్యక్తులు రోడ్డుపై నిలబడి, మోటార్ సైకిల్‌కు అడ్డం వచ్చినట్లు, దాంతో అతను బ్యాలెన్స్ తప్పి పడిపోయినట్లు సిసిటివీలో రికార్డయింది. వారికి మరో ఇద్దరు తోడై పడిపోయిన మోటార్ సైక్లిస్టుపై విరుచుకుపడ్డారు. కింద మీద పడేసి కొట్టి చంపారు. దుండగుల్లో ఒకతను కత్తితో పొడిచాడు. మరొకడు మోటార్ సైక్లిస్ట్ తలపై రాయి విసిరాడు. దాడిని చూస్తూ కూడా ఆపడానికి ప్రయత్నించనివారిని కోయంబత్తూర్ డిప్యూటీ పోలీసు కమిషనర్ నిజాముద్దీన్ తప్పు పట్టారు. పోలీసులు వచ్చి బాధితుడిని ఆస్పత్రిలో చేర్చే లోగానే మరణించాడని ఆయన చెప్పారు.

English summary
Police have arrested four men who tripped a man driving a motorcycle on a busy street in Coimbatore and murdered him as dozens of people watched in horror.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X