ప్రత్యేక తెలంగాణ రాష్ట్రానికి మా మద్దతు: గడ్కారీ
తెలంగాణ ఏర్పాటు అంశానికి సంబంధించి లోక్ సభలో తీర్మానాన్ని ప్రవేశపెడితే ఆ తీర్మానానికి తమ సభ్యులు మద్దతునిస్తారని ఆయన స్పష్టం చేశారు. తెలంగాణా డిమాండ్ల సాధనకు భాజపా కృషి చేస్తుందని , తెలంగణా వాదులు చేస్తున్న పోరాటాలకు తమ పార్టీకి చెందిన 165 ఎంపీలు అండగా నిలుస్తారని గడ్కారీ హామి ఇచ్చారు.
2004, 2007లో తెలంగాణాకు అనుకూలమని ప్రకటించి అక్కడి వారి మద్దతు కూడగట్టుకున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఆ మాట నిలబెట్టుకోలేక పోయిందని ఎండగట్టారు. ఉద్యమంలో భాగంగా ప్రత్యేక తెలంగాణాను కోరుతూ 143 మంది ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ సభ్యులు రాజీనామ చేసినప్పటికి సమస్య పరిష్కారానికి కాంగ్రెస్ సర్కారు కృషి చేయకపోవటం రాజకీయ అనుభవలేమిగా అభివర్ణించారు.
శ్రీ కృష్ణ కమిటీ నివేదికలను పరిగణలోకి తీసకున్న కాంగ్రెస్, తెలంగాణా వ్యవహారం పై నాన్చుడు ధోరణిని అవలంభిస్తుందని గడ్కారీ విమర్శించారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే నత్తనడకన సాగుతున్న ఇరిగేషన్ ప్రాజెక్టులను పూర్తి చేయటంతో పాటు తెలంగాణా జాలల విషయంలో అవాంతరాలను తొలగిస్తామని గడ్కారీ స్పష్టం చేశారు.
తెలంగాణ ప్రజలకు కృష్ణా గోదావరి జలాలు సమృద్ధిగా అందించటంతో పాటు వెనుకబడి ఉన్న అనేక అభివృద్ధి పనులకు శ్రీకారం చుడతామని హామి ఇచ్చారు. భారతీయ జనతా మోర్చా అధ్యక్షురాలు, ఎంపీ స్మృతీ ఇరానీతో పాటు పార్టీ ఓవర్ సీస్ కన్వీనర్ విజయ్ జోలీ తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు.