విచారణపై జగన్ సుప్రీంకు వెళ్లలేదు: అంబటి

కాగా అంతకుముందు తన ఆస్తులపై సిబిఐ విచారణ ఆపించాలని కోరుతూ వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి సుప్రీంకోర్టుకు వెళ్లినట్లు వార్తలు వచ్చాయి. సుప్రీంకోర్టులో ఆయన స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేశారు. ఎస్.ఎల్.పి పై విచారణ పూర్తయ్యేవరకు ఎలాంటి విచారణ చేపట్టరాదంటూ ఈ మేరకు పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ బుధవారం సుప్రీంకోర్టులో విచారణకు వచ్చే అవకాశం ఉంది. వైయస్ జగన్ ఆస్తులపై ప్రాథమిక విచారణ జరిపి రెండు వారాల్లోగా తమకు సీల్డ్ కవర్లో నివేదిక సమర్పించాలని రాష్ట్ర హైకోర్టు ఇటీవల సిబిఐని ఆదేశించిన విషయం తెలిసిందే.












Click it and Unblock the Notifications