హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

విచారణపై వైయస్ జగన్‌కు శంకర రావు ప్రశ్న

By Srinivas
|
Google Oneindia TeluguNews

P Shankar Rao
హైదరాబాద్: వైయస్సాఆర్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డిని సిబిఐ దర్యాఫ్తుపై చేనేత, జౌళీ శాఖమంత్రి శంకర్ రావు మంగళవారం ప్రశ్నించారు. మంత్రి సిఎల్పీ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. సిబిఐ దర్యాఫ్తుకు ముందు తన ఆస్తులపై సిబిఐ విచారణకు సిద్ధమని ప్రకటించిన వైయస్ జగన్మోహన్ రెడ్డి సిబిఐ దర్యాఫ్తు జరుగుతున్న సమయంలో ఇప్పుడు సుప్రీం కోర్టుకు ఎందుకు వెళ్లారని ప్రశ్నించారు. తన వద్ద ఎలాంటి అక్రమ ఆస్తులు లేకుంటే సుప్రీంను ఆశ్రయించి సిబిఐ విచారణను ఆపాలని ఎందుకు కోరతారని ప్రశ్నించారు. చట్టం ముందు అందరూ సమానులేనని అన్నారు.

ప్రత్యేక తెలంగాణ రాష్ట్రానికి తాను కట్టుబడి ఉన్నానని మంత్రి చెప్పారు. కాంగ్రెసు పార్టీ అధిష్టానాన్ని ప్రత్యేక తెలంగాణ రాష్ట్రానికి ఒప్పిస్తామని చెప్పారు. అధిష్టానం అపాయింటుమెంటు కోరానని చెప్పారు. పార్టీ హైకమాండుకు తెలంగాణ కోసం తాను లేఖను సైతం రాసినట్లు చెప్పారు. తెలంగాణ కోసం ఉద్యమం చేద్దామని తన వద్దకు తెలంగాణ నేతలు ఎవరూ రాలేదని అందుకే తాను వెళ్లలేదని చెప్పారు.

English summary
Minister Shankar Rao questioned YSR Congress president YS Jaganmohan Reddy today about cbi probe.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X