వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బలవంతపు ఆధిపత్యానికి సమైక్యవాదం: కోదండరామ్

By Pratap
|
Google Oneindia TeluguNews

Kodandaram
హైదరాబాద్: బలవంతపు ఆధిపత్యం కోసం సమైక్యవాదాన్ని ముందుకు తెచ్చారని తెలంగాణ రాజకీయ జెఎసి చైర్మన్ కోదండరామ్ అన్నారు. ఆధిపత్యాన్ని అంతమొందించడానికి తెలంగాణ ఉద్యమం సాగుతోందని ఆయన శనివారం మీడియా ప్రతినిధులతో అన్నారు. సీమాంధ్ర, తెలంగాణ ప్రాంతాల మధ్య వైషమ్యాలను తాము కోరుకోవడం లేదని, తమ పోరాటం సీమాంధ్ర పెట్టుబడిదారులపైనే గానీ ప్రజలపై కాదని ఆయన స్పష్టం చేశారు. తెలంగాణలో సీమాంధ్ర ప్రజలపై దాడులు జరుగుతాయనే విషప్రచారాన్ని నమ్మవద్దని ఆయన ప్రజలను కోరారు. తెలంగాణ ఉద్యమం ఆత్మగౌవరం కోసం సాగుతోందని, ఈ ఉద్యమాన్ని మరింత బలోపేతం చేస్తామని ఆయన చెప్పారు. తమ స్వార్థప్రయోజనాల కోసం సీమాంధ్ర పాలకులు విష ప్రచారం సాగిస్తున్నారని ఆయన అన్నారు.

పెనుగంచిప్రోలులో తెలంగాణవారిపై జరిగిన దాడిని తెలంగాణ ఉద్యోగ సంఘాల నాయకుడు స్వామిగౌడ్ ఖండించారు. అటువంటి సంఘటనలు పునరావృతమైతే బాధ్యత సీమాంధ్ర పాలకులదేనని ఆయన అన్నారు. తెలంగాణలో వేలాది మంది సీమాంధ్ర ప్రజలు నివసిస్తున్నారని, వారిపై దాడులు చేయబోమని ఆయన అన్నారు. తమపై బురదచల్లడం ఆపాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ నెల 26వ తేదీన ఉద్యోగ సంఘాలు సమావేశమై సమ్మె ఎప్పటి నుంచి చేయాలనే విషయంపై నిర్ణయం తీసుకుంటాయని అన్నారు. సకల జనుల సమ్మెతో తాము కలిసి సాగుతామని ఆయన చెప్పారు. కాగా, తెలంగాణ మెడికల్ జెఎసి సమ్మె నోటీసు ఇచ్చింది.

English summary
Telangana JAC Chairman Kodandaram said that united Andhra movement is for hegemony.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X