కర్నూలు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

వైయస్ జగన్‌ను ప్రశ్నించిన తెలుగు తమ్ముళ్లు

By Pratap
|
Google Oneindia TeluguNews

YS Jagan
కర్నూలు: కర్నూలు జిల్లా ఓదార్పు యాత్రలో తెలుగుదేశం కార్యకర్తలు కొంత మంది వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డిని నిలువరించారు. కర్నూలు జిల్లా ముచ్చమర్రి గ్రామంలో ఈ సంఘటన చోటు చేసుకుంది. దివంగత నేత వైయస్ రాజశేఖర రెడ్డి చేపట్టిన జలయజ్ఞంపై తెలుగుదేశం కార్యకర్తలు జగన్‌ను ప్రశ్నించారు. దాంతో వాహనం దిగిన జగన్ జలయజ్ఞం వల్ల మేలే జరిగిందని వారికి సమాధానం చెప్పారు. జలయజ్ఞం ద్వారా వైయస్ రాజశేఖర రెడ్డి మేలు చేశారని ఆయన అన్నారు.

జలయజ్ఞం ఫలితాలపై తాను వివరించడానికి సిద్ధంగా ఉన్నానని, అయితే ఇప్పుడు దానికి సమయం కాదని ఆయన అన్నారు. హైదరాబాదు వస్తే జలయజ్ఞం వల్ల సాధించిన ఫలితాలపై వివరంగా చెప్పడానికి తాను సిద్ధంగా ఉన్నానని జగన్ తెలుగుదేశం కార్యకర్తలతో చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోయారు. గత కొద్దిరోజులుగా వైయస్ జగన్ కర్నూలు జిల్లాలో ఓదార్పు యాత్ర నిర్వహిస్తున్న విషయం తెలిసిందే.

English summary
TDP activists stopped YSR Congress party president YS Jagan and asked about YSR's Jalayagnam scheme.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X