సీమాంధ్రులతో కలిసి ఉండలేం, రెచ్చగొడుతున్నారు: విహెచ్

తాము ముస్లిం పాలనకు అలవాటు పడ్డామని, తమకు ముస్లింల వల్ల ఏ విధమైన ప్రమాదం లేదని, తమ బాధలేవో తాము పడుతామని, సీమాంధ్రులకు ఈ విషయాలు ఎందుకని ఆయన అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఇస్తే ముస్లింలు ఆధిపత్యం వహిస్తారని, తీవ్రవాదమూ నక్సలిజమూ పెరుగుతుందని సీమాంధ్ర నాయకులు తప్పుడు ప్రచారం సాగిస్తున్నారని ఆయన అన్నారు. 2004, 2009 ఎన్నికల్లో ఎన్నికల ప్రణాళికలో తెలంగాణ అంశాన్ని పెట్టామని, అయినా సీమాంధ్ర ప్రజలు కాంగ్రెసు పార్టీకి ఓటేశారని, దీన్నిబట్టి సీమాంధ్ర ప్రజలు తెలంగాణను వ్యతిరేకించడం లేదని అర్థమవుతోందని ఆయన అన్నారు. తెలంగాణ కోసం రాజ్యసభలో పోరాటం చేయడానికే తాను రాజీనామా చేయలేదని ఆయన స్పష్టం చేశారు.












Click it and Unblock the Notifications