వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

'అంబానీ సోదరులకు మీడియా అతి ప్రచారం'

By Srinivas
|
Google Oneindia TeluguNews

Mukesh Ambani
అంబానీ సోదరులకు భారతీయ మీడియా అతి ప్రచారం కల్పిస్తోందని వారు అందలం ఎక్కిన అక్రమార్కులని కెనడాకు చెందిన ఓ అనలిస్ట్ ఆరోపించారు. ముఖేష్ అంబానీ, అనీల్ అంబానీలు అందలం ఎక్కిన అక్రమార్కులు... దేశంలో అత్యంత విలువైన కంపెనీలకు అధిపతులైన వీరిపై కెనడాలోని టోరంటోకు చెందిన ప్రముఖ ఇన్వెస్టుమెంటు రీసెర్చు సంస్థ వెరిటాస్ ఇన్వెస్టుమెంట్ రీసెర్చ్ వైస్ ప్రెసిడెంట్ నీరజ్ మోంగా వ్యాఖ్యానించినట్లుగా తెలుస్తోంది. ఆయన ఇటీవల వారిపై ఓ నివేదిక వెలువర్చారంట. అవి అంతర్జాతీయ మార్కెట్లో పెను సంచలనం రేపాయి. అంబానీ సోదరుల వాటాల పంపకంలో భాగంగా రిలయన్స్ ఇండస్ట్రీసును 2006లో టెలికాం వ్యాపారాన్ని ఆర్కాంకు బదలాయించి కారణంగా వాటాదారులు వేల కోట్ల రూపాయలు నష్ట పోయారని భారతీయ సంతతికి చెందిన వరుణ్ రాజ్‌తో కలిసి ఆయన ఆరోపించారు.

కార్పోరేట్ ఇండియా సర్వ అవలక్షణాలకు ఆర్కామ్ ప్రతీక అని నీరజ్ వ్యాఖ్యానించాడు. ఉత్తర అమెరికాలోని తమ క్లయింట్లు అనేకమంది రిలయన్స్ కంపెనీల్లో ఇన్వెస్టు చేశారని ఆయన అంబానీ సోదరుల కంపెనీల పైకి దృష్టి మళ్లడంపై వివరించారు. కెనడాలోని అత్యంత విశ్వసనీయమైన ఇన్వెస్టుమెంట్ రీసెర్చ్ కంపెనీగా విరాటాస్‌కు పేరుందని నీరజ్ మోంగా పేర్కొన్నాడు. ఆర్కామ్, ఆర్ఐఎల్ కంటే తమ కంపెనీకి ఎక్కువ విశ్వసనీయత అంతర్జాతీయంగా ఉందని ఆయన చెప్పినట్లుగా తెలుస్తోంది. భారతీయ మీడియా అంబానీ సోదరులకు ఎక్కువ ప్రచారం కల్పిస్తోందని అన్నారు. వీరి వ్యాపారలలోని అక్రమాలను పట్టించుకోకుండా వారిని అందలం ఎక్కిస్తోందని ఆరోపించారు. అయితే నీరజ్ మోంగా అంటున్న కంపెనీ పేరు తాము ఎప్పుడూ వినలేదని ఆర్కామ్ అంటోందంట.

English summary
Neeraj Monga, who was vice president of veritas investments blamed Ambani Brothers.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X