వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బళ్లారి అక్రమ మైనింగ్‌పై సుప్రీంకోర్టు కన్నెర్ర

By Pratap
|
Google Oneindia TeluguNews

Supreme Court
న్యూఢిల్లీ: బళ్లారి మైనింగ్‌పై సుప్రీంకోర్టు కన్నెర్ర చేసింది. తపాల్ గణేష్ అనే వ్యక్తి వేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టు శుక్రవారం తన నిర్ణయాన్ని వెలువరించింది. బళ్లారి అభయారణ్యంలో మైనింగ్ తవ్వకాలను ఆపేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. తదపరి ఆదేశాలు జారీ చేసే వరకు మైనింగ్ నిలిపేయాలని స్పష్టం చేసింది. గనుల తవ్వకాల వల్ల పర్యావరణానికి జరుగుతున్న నష్టంపై సుప్రీంకోర్టు దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. పర్యావరణ సమతుల్యతను పునరుద్ధరించే బాధ్యతను కర్ణాటక ప్రభుత్వం తీసుకోవాలని, దానికి అవసరమైన నిధులను మైనింగ్ కంపెనీల నుంచి రాబట్టాలని సూచించింది.

గనుల తవ్వకాల వల్ల పర్యావరణానికి జరిగిన నష్టంపై నివేదిక సమర్పించాలని కూడా సుప్రీంకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది. దేశంలోని పరిశ్రమలకు ఎంత ముడి ఇనుము అవసరమో లెక్కలు వేయాలని సూచించింది. అందులో బళ్లారి ఏ మేరకు భర్తీ చేస్తోందో కూడా చూపాలని సూచించింది. దేశంలో ఉత్పత్తి అవుతున్న ఉక్కు ఎంత ఎగుమతి అవుతుందో చెప్పాలని ఆదేశించింది. దేశంలోనే గనుల తవ్వకాలను అన్నింటినీ ఎన్‌ఎండిసికి అప్పగించే ఆలోచన చేయాలని కూడా సూచించింది. కొద్ది మంది దురాశ ప్రతి ఒక్కరినీ బాధిస్తోందని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది.

English summary
The Supreme Court ordered the suspension of all mining operations in the Bellary district. The court said it was shocked by the extent of the environmental damage in the area.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X