అనంత పద్మనాభ స్వామి గుడి వద్ద అగ్ని ప్రమాదం

Padmanabha Swami temple
తిరువనంతపురం: అనంతమైన సంపదతో వార్తల్లోకి ఎక్కిన తిరువనంతపురంలోని అనంత పద్మనాభ స్వామి ఆలయం వద్ద ఆదివారం సాయంత్రం భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. స్థానిక దుకాణాల నుంచి పెద్ద ఎత్తున మంటలు ఎగసిపడటంతో పాటు, భారీ పేలుళ్ల శబ్ధాలు కూడా వినిపిస్తున్నాయి. సమాచారం తెలుసుకున్న డీజీపీ, ఎస్పీతో పాటుఅగ్నిమాపక సిబ్బంది హుటాహుటీన ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితి అదుపు చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఓ హస్తకళల దుకాణంలో తొలుత మంటలు ఎగిసిపడ్డాయి. ఆదివారం రాత్రి పొద్దు పోయే వరకు కూడా మంటలను అదుపు చేయడానికి ప్రయత్నాలు సాగుతూనే ఉన్నాయి.

పేలుళ్ల జరగడానికి గల కారణాలు తెలియరాలేదు. ఈ ఘటనతో బెంబేలెత్తిన స్థానికులు భారీగా ఆలయం వద్దకు చేరుకుంటున్నారు. ఆలయ సమీపంలో విద్యుత్‌ వ్యవస్థ నిలిచిపోయింది. మరోపక్క స్వామి ఆలయాన్ని సందర్శించడానికి రేపు నిపుణుల బృందం తిరువనంతపురం రానుంది. ఈ నేపథ్యంలో ఇలాంటి ఘటన జరగడం అనేక అనుమానాలు తావిస్తోంది. ఆలయానికి, నేలమాళిగల్లో బయటపడిన సంపదకు ఎలాంటి ముప్పు లేదని డీజీపీ స్పష్టం చేశారు. ఆలయం చుట్టూ భద్రతను మరింత కట్టుదిట్టం చేసినట్లు ఆయన తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+