హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

వైయస్ జగన్ కేసులో విచారణ రేపటికి వాయిదా

By Srinivas
|
Google Oneindia TeluguNews

CBI
హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి కేసు విచారణను హైకోర్టు రేపటికి (మంగళవారానికి) వాయిదా వేసింది. జగన్ తరఫు న్యాయవాదులు కౌంటర్ దాఖలు చేశారు. కాగా, ఎమ్మార్ కేసులో వాదనలు పూర్తయ్యాయి. వైయస్సాఆర్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన ఆస్తులపై సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్(సిబిఐ) సోమవారం రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం హైకోర్టుకు అనుబంధ నివేదికను సమర్పించింది. ఎమ్మార్‌తో పాటు జగన్‌కు సంబంధించిన జగతి తదితర కంపెనీల దర్యాఫ్తు నివేదికను హైకోర్టుకు సోమవారం ఉదయం అందించింది. సిబిఐ తరఫున ఐజి లక్ష్మీ నారాయణ హాజరై కోర్టుకు సీల్డు కవర్‌లో నివేదిక సమర్పించారు. జగతి పబ్లికేషన్స్ తరఫున విజయసాయిరెడ్డి హాజరయ్యారు.

కాగా గత పద్దెనిమిది రోజులుగా జగన్ కంపెనీలలోకి పెట్టుబడులు ఎలా వచ్చాయి? ఏయే కంపెనీలు పెట్టుబడులు పెట్టాయి? ఎలా పెట్టాయి? పెట్టుబడులు పెట్టే స్థోమత ఆయా కంపెనీలకు ఉన్నాయా? తదితర అంశాలపై సిబిఐ దర్యాఫ్తు చేసింది. గత నెల 27వ తేది వరకు సిబిఐ ప్రాథమిక విచారణ దాదాపు పూర్తి చేసింది. అయితే ఆ రోజు తీర్పు వాయిదా పడటంతో మరింత విచారణకు సిబిఐకి హైకోర్టు అనుమతించింది. దీంతో ఈ నాలుగు రోజులు కూడా సిబిఐ పలు కంపెనీలను విచారించాయి. ఇప్పటి వరకు సుమారు 35 కంపెనీలను సిబిఐ విచారించింది.

English summary
CBI gave additional report to high court on YSR Congress party YS Jaganmohan Reddy's property.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X