హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

వైయస్ జగన్ ఆస్తుల కేసు నిర్ణయం రిజర్వ్

By Srinivas
|
Google Oneindia TeluguNews

High Court
హైదరాబాద్: వైయస్సాఆర్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి కేసులో అందరి వాదనలు విన్న హైకోర్టు గురువారం తీర్పును రిజర్వ్ చేసింది. ఎమ్మార్ అక్రమాలపై తీర్పునూ రిజర్వ్ చేశారు. గురువారం ఉదయం షేర్వాణీ పిటిషన్‌పై వాదనలు పూర్తయిన అనంతరం ప్రధాన న్యాయమూర్తి ఎమ్మార్, జగన్ ఆస్తులపై నిర్ణయాన్ని రిజర్వ్ చేశారు. షేర్వాణీ వాదనల అనంతరం ధర్మాసనం సిబిఐ సమర్పించిన ప్రాథమిక దర్యాఫ్తు సీల్డు కవర్‌లను తెరిచింది. ఎమ్మార్, జగతి పబ్లికేషన్స్‌పై రెండు సీల్డు కవర్‌లను సిబిఐ హైకోర్టుకు సమర్పించింది. జగన్ ఆస్తుతలపై 125 పేజీల నివేదికను సిబిఐ కోర్టుకు సమర్పించింది.

మంగళవారం మంత్రి శంకరరావు, బుధవారం టిడిపి నేత ఎర్రన్నాయుడు పిటిషన్‌పై వాదనలు పూర్తయిన విషయం తెలిసిందే. గురువారం షేర్వాణీ పిటిషన్‌పై వాదనలు జరిగాయి. జగన్ కంపెనీలలోకి కోట్లాది రూపాయలు అక్రమంగా వచ్చాయని షేర్వాణి తరఫు లాయరు వాదించగా జగన్ తరఫు న్యాయవాది దానిని కొట్టి పారేశారు. కాగా వాదనల సమయంలో సిబిఐ జాయింట్ డైరెక్టర్ హాజరయ్యారు. కాగా శంకరరావు, ఎర్రన్నాయుడు, షేర్వాణి పిటిషన్‌లలో విభిన్న అంశాలు ఉన్నట్లుగా తెలుస్తోంది.

English summary
High Court reserved its decision on YSR Congress party president YS Jagan's properties case.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X