విప్ను ధిక్కరించిన తెలంగాణ కాంగ్రెసు, షేట్కారు హాజరు

అనంతరం గుత్తా సుఖేందర్ రెడ్డి, మధుయాష్కీ మాట్లాడారు. రాజీనామాలపై తాము రాజీ పడే ప్రసక్తి లేదని చెప్పారు. శనివారం రోజు హైదరాబాదులో కాంగ్రెసు స్టీరింగ్ కమిటీ సమావేశం అయి నిర్ణయాలు తీసుకుంటామని చెప్పారు. తెలంగాణ కోసం ప్రజా సంఘాలు చేస్తున్న ఆందోళనలకు మద్దతు ఇస్తామని చెప్పారు. అయితే ఉద్యోగ సంఘాలు చేస్తున్న దీక్షకు తాము మద్దతు ప్రకటించేది లేనిది స్టీరింగ్ కమిటీలో నిర్ణయిస్తామని చెప్పారు.
ఓటింగు అనంతరం షేట్కారు విలేకరులతో మాట్లాడారు. ప్రభుత్వానికి ఇబ్బందులు కలగకూడదనే ఓటింగులో పాల్గొన్నట్టు చెప్పారు. ధరల పెరుగుదల విషయంలో ఓటింగులో పాల్గొన్నట్లు చెప్పారు. అయితే తెలంగాణ కోసం ఉద్యమం కొనసాగుతుందన్నారు. ఓటింగుకు తెలంగాణ ప్రజాప్రతినిధులు అందరూ రావాలని అనుకున్నప్పటికీ ఓటింగ్ ముందుగా జరగడం వల్ల వారు రాలేక పోయారని చెప్పారు. ప్రజలు మమ్మల్ని ఎన్నుకున్నది సమావేశాలు బహిష్కరించడానికి కాదన్నారు. కాగా లోక్ పాల్ బిల్లును మంత్రి సల్మాన్ ఖుర్షీద్ ప్రవేశ పెట్టారు. అయితే ప్రధాని, న్యాయవ్యవస్థను లోక్ పాల్ పరిధిలోకి తీసుకు రాకపోవడంపై విపక్షాలు ప్రశ్నించాయి.












Click it and Unblock the Notifications