కావూరిపై భగ్గుమన్న కోదండరామ్, కెటి రామారావు

కావూరి సాంబశివ రావు ప్రకటన తర్వాతనైనా రాజీనామా చేయని తెలంగాణ ప్రజాప్రతినిధులు ఆత్మగౌరవం కాపాడుకుని రాజీనామా చేయాలని కెటి రామారావు అన్నారు. రాజీనామాలను స్పీకర్ ఎన్నిసార్లు తిరస్కరిస్తే అన్ని సార్లు రాజీనామాలు చేయాలని ఆయన మీడియా ప్రతినిధులతో అన్నారు. శాసనసభ సమావేశాలను ఏర్పాటు చేసే సత్తా ఈ ప్రభుత్వానికి లేదని ఆయన అన్నారు. తెలంగాణపై ఏకాభిప్రాయం కావాలన్న చిదంబరం ప్రకటనను ఆయన తప్పు పట్టారు. ఏ అంశం మీద కూడా ఏకాభిప్రాయం రాదని, మెజారిటీ నిర్ణయాన్ని పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుందని ఆయన అన్నారు. కాంగ్రెసు, తెలుగుదేశం శాసనసభ్యులు మళ్లీ రాజీనామాలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. 14ఎఫ్ తొలగింపునకు ముఖ్యమంత్రి అఖిల పక్షాన్ని ఢిల్లీకి తీసుకుని వెళ్లాలని ఆయన విజ్ఞప్తి చేశారు.












Click it and Unblock the Notifications