హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

అమెరికాలోని కొలంబస్‌లో తెలుగు వ్యక్తి ఆత్మహత్య

By Pratap
|
Google Oneindia TeluguNews

USA
హైదరాబాద్: అమెరికాలో ఓ తెలుగు వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న విషాద సంఘటన చోటు చేసుకుంది. ప్రశాంత్ రెడ్డి సూరి అనే వ్యక్తి ఇండియానాపోలిస్‌లోని కొలంబస్‌లో గల ఓ ఆపార్టుమెంటులో అతను ఆత్మహత్య చేసుకున్నట్లు అమెరికా తెలుగు సంఘం (ఆటా) ప్రతినిధులు తెలిపారు. ఆగస్టు 5వ తేదీన ఈ సంఘటన చోటు చేసుకుంది. ప్రశాంత్ రెడ్డి కుటుంబం హైదరాబాదులోని పంజగుట్టలో ఉంటోంది. అతని తండ్రి పేరు ఆనంద రెడ్డి. స్వస్థలం నెల్లూరు.

హైదరాబాదులోని అతని కుటుంబ సభ్యులు చాలా రోజులుగా ప్రశాంత్ రెడ్డితో మాట్లాడడానికి ప్రయత్నించారు. కానీ సమాధానం లభించలేదు. దీంతో వారు చికాగోలోని ఓ మిత్రుడిని సంప్రదించారు. అతను ఆటా సహాయం తీసుకున్నాడు. ఆటా ప్రతినిధులు పోలీసులకు చెప్పడంతో వారు అపార్డుమెంటును తెరిచి చూసే సరికి ప్రశాంత్ రెడ్డి ఆత్మహత్య చేసుకుని కనిపించాడు. ఓ స్యూసైడ్ నోట్ కూడా రాశాడు. అందులోని వివరాలు తెలియడం లేదు.

ప్రశాంత్ రెడ్డి కుమ్మిన్స్‌లో పనిచేసేవాడు. కొద్ది వారాల క్రితం ఉద్యోగాన్ని వదిలేశాడు. అతనికి హెచ్1బి వీసా ఉంది. అతని మృతదేహాన్ని ఫ్యునెరల్ హోమ్‌కు అప్పగించారు. లాంఛనాలు పూర్తి చేసి, ప్రశాంత్ మృతదేహాన్ని హైదరాబాదు పంపేందుకు ఆటా ఏర్పాట్లు చేసింది. ఆటా చికాగో యాక్షన్ టీమ్ అందుకు కృషి చేస్తోందని ఆటా మీడియా చైర్ హరిప్రసాద్ రెడ్డి లింగాల చెప్పారు.

English summary
Prashanth Reddy Suri from Panjagutta, Hyderabad son of Anand Reddy who is native of Nellore, has committed suicide in his apartment in Columbus, Indianapolis on Friday, 5th August 2011.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X