హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

సిబిఐ దాడులు: ముఖ్యమంత్రిని కలిసిన జగన్ వర్గం

By Srinivas
|
Google Oneindia TeluguNews

Balineni Srinivas Yadav
హైదరాబాద్: వైయస్సాఆర్సీ పార్టీ అధినేత, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆస్తులపై, ఆయన కంపెనీలలో పెట్టుబడులు పెట్టిన వారి ఇళ్లు, కార్యాలయాలపై దాడుల నేపథ్యంలో జగన్ వర్గం నేతలు మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి, శాసనమండలి సభ్యుడు జూపూడి ప్రభాకర రావు శుక్రవారం ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిని కలిశారు. జగన్ పైనే కాకుండా నాటి నిర్ణయాలలో అక్రమాలు ఉన్నాయనుకుంటే నాటి మంత్రివర్గం పైనా సిబిఐ విచారణ చేయించాలని వారు ముఖ్యమంత్రిని కోరారు.

నాటి మంత్రివర్గంలో ఉన్నందుకు సిబిఐ విచారణకు తాను సిద్ధంగా ఉన్నానని బాలినేని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకు వెళ్లారు. కాగా బాలినేని వైయస్ రాజశేఖర రెడ్డి మంత్రివర్గంలో గనులు, భూగర్భ శాఖ మంత్రి పదవిని నిర్వహించారు. వైయస్ మృతి అనంతరం ఆయన జగన్ వెంట వెళ్లారు. అధిష్టానం హెచ్చరించినప్పటికీ ఆయన తగ్గలేదు. గురువారం జగన్ ఆస్తులపై సిబిఐ దాడులు నిర్వహిస్తుందని తెలియగానే ఆయన హుటాహుటినా జగన్ ఇంటికి చేరుకున్నారు.

English summary
YSRC party chief YS Jaganmohan Reddy camp leaders Balineni Srinivas Reddy, Jupudi Prabhakar Rao met CM Kiran Kumar Reddy today.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X