సిబిఐ అదుపులో ఐఎఎస్ అధికారి బిపి ఆచార్య?
సిబిఐ హైదరాబాద్లోని దిల్కుషా అతిథి గృహం వద్ద మీడియా హడావిడి ఎక్కువగా ఉండడంతో మరో ప్రదేశంలో బిపి ఆచార్యను సిబిఐ అధికారులు విచారిస్తున్నట్లు తెలుస్తోంది. ఎమ్మార్ ప్రాపర్టీస్కు భూకేటాయింపులు, వాటా తగ్గింపులపై సిబిఐ అధికారులు ఆయనను ప్రశ్నిస్తున్నట్లు తెలుస్తోంది. మరికొంత మందిని కూడా సిబిఐ విచారిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. వైయస్ జగన్ ఆస్తుల కేసులో సిబిఐ జగతి పబ్లికేషన్స్ ఆడిటర్ వరదరాజన్కు సిబిఐ నోటీసులు జారీ చేసింది. తమ ముందు హాజరు కావాలని సిబిఐ అధికారులు ఆయనకు ఫోన్ ద్వారా తెలిపినట్లు సమాచారం.
Comments
English summary
It is learnt that CBI is questioning APIIC ex managing director and IAS officer BP Acharya in undisclosed place.
Story first published: Wednesday, August 24, 2011, 14:49 [IST]