హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

వైయస్ జగన్ ఆస్తుల కేసుపై ఈడి కసరత్తు!

By Srinivas
|
Google Oneindia TeluguNews

YS Jagan
హైదరాబాద్/న్యూఢిల్లీ: వైయస్సార్సీ పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆస్తులు, ఎమ్మార్ కేసుల విషయంలో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడి) విచారణకు సిద్ధమైనట్లుగా కనిపిస్తోంది. ఇటీవలె సిబిఐ దర్యాఫ్తు చేస్తున్న కార్యాలయానికి వెళ్లి రెండు కేసులలో సిబిఐ ఎఫ్ఐఆర్‌లు పరిశీలించిన ఈడి శుక్రవారం డిప్యూటీ డైరెక్టర్‌తో భేటీ అయినట్లుగా
సమాచారం. సిబిఐ నుండి కేసుకు సంబంధించిన పూర్తి వివరాలను తీసుకున్నట్లుగా తెలుస్తోంది. జగన్, ఎమ్మార్ కేసుల విషయంలో తమ విచారణకు సంబంధించి శుక్రవారం మీడియాకు విడుదల చేసే అవకాశాలు ఉన్నాయి.

జగన్‌కు చెందిన జగతి పబ్లికేషన్స్‌లోకి నిధులు ఎలా వచ్చాయి? ఎక్కడి నుండి వచ్చాయి? తదితర అంశాలపై ఈడి దృష్టి సారించనున్నట్లుగా తెలుస్తోంది. ఈ కేసులలోని నిందితులకు ఈడి త్వరలో నోటీసులు జారీ చేసే అవకాశాలు ఉన్నాయి. కాగా సిబిఐ అధికారులు శుక్రవారం జగతి పబ్లికేషన్స్ వైస్ చైర్మన్ విజయసాయి రెడ్డితో సహా మరో ఇద్దరికి నోటీసులు జారీ చేశారు. అధికారులు జగన్, ఎమ్మార్ కేసుల విషయంలో సచివాలయంలోని ఫైళ్లను పరిశీలిస్తున్నారు.

కాగా ఎమ్మార్ కేసులో స్టే ఇవ్వడానికి సుప్రీం కోర్టు శుక్రవారం నిరాకరించింది. కేసుతో సంబంధం ఉన్న సిబిఐ, మంత్రి శంకర్ రావుతో సహా పలువురికి నోటీసులు జారీ చేసింది. కాగా కేసును వారం రోజుల పాటు వాయిదా వేసింది. నోటీసులు పంపిన వారు వారం రోజులలో తమ సమాధానం చెప్పాలని ఆదేశాలు జారీ చేసింది.

English summary
It seems, ED concentrate on YSRC Party president YS Jaganmohan Reddy's and EMAAR cases. Supreme Court issues notices to minister Shankar Rao in EMAAR case.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X