రోశయ్యకు క్లీన్‌చిట్‌పై ఎసిబి మీద కోర్టు ఆగ్రహం

Rossaiah
హైదరాబాద్: మాజీ ముఖ్యమంత్రి, తమిళనాడు ప్రస్తుత గవర్నర్ కె. రోశయ్యకు హైదరాబాదులోని అమీర్‌పేట భూ కుంభకోణం కేసులో క్లీన్‌చిట్‌ ఇవ్వడంపై కోర్టు అవినీతి నిరోధక శాఖ (ఎసిబి)పై ఆగ్రహం వ్యక్తం చేసింది. రోశయ్యకు క్లీన్‌చిట్ ఇవ్వడంపై న్యాయవాది శ్రీరంగారావు మళ్లీ కోర్టుకెక్కారు. ఏ ఆధారాలతో రోశయ్యకు క్లీన్‌చిట్ ఇచ్చారని ఎసిబి కోర్టు ప్రశ్నించింది. అందుకు సంబంధించిన పత్రాలను ప్రతివాదులకు కూడా ఇవ్వాలని కోర్టు ఆదేశించింది. కేసు విచారణ ఈ నెల 26వ తేదీకి వాయిదా పడింది.

తక్కువ ధరకు అత్యంత విలువైన భూములను తమ సన్నిహితులకు కట్టబెట్టారని శ్రీరంగారావు రోశయ్యపై, మరో 14 మందిపై ఎసిబి కోర్టుకు ఫిర్యాదు చేశారు. దానిపై విచారణ జరిపిన ఎసిబి రోశయ్యకు క్లీన్‌చిట్ ఇచ్చింది. ఆ కేసులో క్లీన్‌చిట్ లభించిన తర్వాత రోశయ్య తమిళనాడు గవర్నరుగా నియమితులయ్యారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+