తిరుపతి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

అనుమానంతో భార్య దారుణ హత్య, పరారీలో భర్త

By Srinivas
|
Google Oneindia TeluguNews

Tirumala
తిరుపతి: జల్సాలకు అలవాటు పడిన ఓ వ్యక్తి తన భార్యపై అనుమానంతో దారుణంగా హతమార్చిన సంఘటన చిత్తూరు జిల్లాలో శుక్రవారం వెలుగు చూసింది. తిరుపతిలోని ఆటోనగర్‌లో చెందిన బాలకృష్ణ అనే వ్యక్తితో ఆరేళ్ల క్రితం అరుణ అనే యువతితో వివాహం అయింది. బాలకృష్ణ సెంట్రింగ్ పనులు చేస్తుంటాడు. అయితే సెంట్రింగ్ పనులతో వచ్చే డబ్బులు ఇంటి ఖర్చులకు సరిపోక పోవడంతో భార్య అరుణను బెంగళూరులోని ఓ ఫ్యాక్టరీలో పని కోసం పంపించాడు. తన సంపాదనకు, భార్య సంపాదన తోడు కావడంతో బాలకృష్ణ క్రమంగా జల్సాలకు అలవాటు పడ్డాడు. మరిన్ని డబ్బులు కావాలని భార్యపై ఒత్తిడి తెచ్చేవాడు. భర్త వైఖరిలో మార్పును గమనించిన అరుణ బెంగళూరు నుండి తిరుపతి వచ్చేసింది.

ఆమె తిరుపతి వచ్చిన తర్వాత భార్యాభర్తల మధ్య పలుమార్లు ఘర్షణ కూడా చోటు చేసుకుంది. బాలకృష్ణకు భార్యపై క్రమంగా అనుమానం కూడా ప్రారంభమైంది. అనుమానంతో ఆమెను వేధించే వాడు. బుధవారం ఉదయం ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్న తన తల్లితో అరుణ మాట్లాడింది. ఆ తర్వాత రెండు రోజులుగా వారి ఇల్లు తాళం వేసి ఉండటంతో శుక్రవారం అనుమానం వచ్చిన తల్లి పోలీసులను ఆశ్రయించింది. ఇంటి తలుపులు పగుల కొట్టి లోపలకి వెళ్లి చూడగా ఇంట్లోని సంపులో అరుణ మృతదేహం కనిపించింది. భర్తే హత్య చేసి ఉంటారని అనుమానిస్తున్నారు. బుధవారమే హత్య చేసి పారిపోయినట్లుగా అనుమానిస్తున్నారు.

English summary
A Husband killed his wife Aruna in Tirupati of Chittoor district.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X