జగన్‌కు షాక్: సిఎం సభలో ఎమ్మెల్యే, కనిపించని జెసి

YS Jagan
అనంతపురం: వైయస్సార్సీ పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డికి ఆయన వర్గం శాసనసభ్యుడు ఒకరు గట్టి షాక్ ఇచ్చారు. అనంతపురం జిల్లాకు చెందిన ఎమ్మెల్యే గుర్నాథ్ రెడ్డి గురువారం జిల్లాలో జరిగిన ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి బహిరంగ సభకు హాజరయ్యారు. బహిరంగ సభకు గుర్నాథ్ రెడ్డియే అధ్యక్షత వహించడం విశేషం. సభలో ప్రసంగించిన గుర్నాథ్ రెడ్డి జై వైయస్సార్, జై కాంగ్రెసు అని తన పూర్తి చేయడం మరో విశేషం. అయితే ఇదే సభ వేదికపై మాజీ మంత్రి, అనంతపురం జిల్లా సీనియర్ శాసనసభ్యుడు జెసి దివాకర్ రెడ్డి కనిపించలేదు. ఆయన సభకు గైర్హాజరయ్యారు.

కాగా గత కొంతకాలంగా గుర్నాథ్ రెడ్డి వైయస్ జగన్మోహన్ రెడ్డి వర్గంలో ఉన్న విషయం తెలిసిందే. ఇటీవల వైయస్సార్ పేరు సిబిఐ ఎఫ్ఐఆర్‌లో ఉందన్న కారణంతో రాజీనామా చేసిన 26 మంది ఎమ్మెల్యేలలో గుర్నాథ్ రెడ్డి కూడా ఒకరు. అయితే కర్నాటక మాజీ మంత్రి గాలి జనార్ధన్ రెడ్డి అరెస్టు, జగన్‌కు ఢిల్లీలో ఓదార్పు లభించక పోవడం మరోవైపు సిబిఐ జగన్ ఆస్తులపై దర్యాఫ్తు వేగవంతం చేయడం తదితర పరిణామాల దృష్ట్యా గుర్నాథ్ రెడ్డి జగన్‌కు మద్దతు పలకడంపై వెనక్కి తగ్గినట్లుగా కనిపిస్తోంది. కాగా గుర్నాథ్ రెడ్డి దారిలోనే మరికొందరు ఎమ్మెల్యేలు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+