తెలంగాణకు 2 నెలల్లో పరిష్కారం: బొత్స సత్యనారాయణ

Botsa Satyanarayana
హైదరాబాద్: తెలంగాణపై రెండు నెలల్లో శాశ్వత పరిష్కారం వస్తుందని ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ గురువారం తమ పార్టీ క్యాడర్‌కు సంకేతాలు పంపించినట్లుగా తెలుస్తోంది. గతంలోనూ ఆయన రెండు మూడు నెలల్లో పరిష్కారమవుతుందని చెప్పారు. తాజాగా ఆయన మూడు రోజుల ఢిల్లీ పర్యటన ముగించుకొని గురువారం హైదరాబాద్ చేరుకున్నారు. తెలంగాణ సమస్య రెండు మూడు నెలల్లో తప్పకుండా పరిష్కారమవుతుందని చెప్పినట్లుగా వార్తలు వచ్చాయి. సకల జనుల సమ్మె కారణంగా ప్రజలకు జరిగే ఇబ్బందులకు ప్రత్యామ్నాయ మార్గాలు ఏర్పాటు చేస్తామని చెప్పారు. ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై చర్చిస్తామన్నారు. ఆర్టీసీ కార్మికులు సమ్మెలో పాల్గొని ప్రజలను ఇబ్బందులకు గురి చేయవద్దని విజ్ఞప్తి చేశారు. సమ్మెలో పాల్గొంటున్న వారు వెంటనే విరమించాలని ఆయన కోరారు.

పిసిస కార్యవర్గాన్ని త్వరగా ఏర్పాటు చేయాలని కేంద్ర మంత్రి, రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ గులాం నబీ ఆజాదును కోరినట్లు చెప్పారు. ఆజాదుతో జరిగిన భేటీలో తెలంగాణ సమస్య, ప్రస్తుతం రాష్ట్రంలోని పరిస్థితులపై చర్చించారని తెలుస్తోంది. కాగా శుక్రవారం మధ్యాహ్నం మూడు గంటల ప్రాంతంలో శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాల నేతలతో సమావేశం కానున్నారు. ఈ నెల 25న ప్రజారాజ్యం పార్టీ విలీన కార్యక్రమంపై చర్చించనున్నట్లు తెలుస్తోంది. పిసిసి, డిసిసి పునర్వ్యవస్థీకరణ, తెలంగాణ అంశం, బాన్సువాడ ఎన్నికలపై ఆయన ప్రధానంగా తన మూడు రోజుల పర్యటనలో అధిష్టానంతో చర్చించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+