రైల్ రోకో: పట్టాలపై నిద్ర, బోరు వద్దే ఎమ్మెల్యే స్నానం

కొరతల పేరుతో సకల జనుల సమ్మెపై ముఖ్యమంత్రి విషపూరిత ప్రచారం చేస్తున్నారని హైదరాబాదులో బిజెపి సీనియర్ నేత దత్తాత్రేయ మండిపడ్డారు. కిరణ్ ఆంధ్ర సిఎంగా వ్యవహరిస్తూ తెలంగాణ ప్రజలకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారన్నారు. ప్రజాస్వామిక హక్కులను కాలరాస్తున్న సిఎం ఫ్యాక్షనిస్టులా ప్రవర్తిస్తున్నారన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో కేంద్రం నుంచి బలగాలను తెప్పించడం కాదని వాస్తవ పరిస్థితులను కేంద్రానికి నివేదిస్తే చాలన్నారు. ఎపిలో గందరగోళానికి కాంగ్రెస్సే కారణమని వాళ్లే పరిష్కారం చూపాలని వెంకయ్య నాయుడు ఢిల్లీలో అభిప్రాయపడ్డారు. పరిస్థితులను చక్కదిద్దే విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేతులెత్తేశాయన్నారు.












Click it and Unblock the Notifications