వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

భార్యను చంపి గంగానదిలో శవాన్ని పడేసిన డాక్టర్

By Pratap
|
Google Oneindia TeluguNews

New Delhi
న్యూఢిల్లీ: ఓ వైద్యుడు తన భార్యను చంపి శవాన్ని గంగానదిలో పడేసిన ఉదంతం వెలుగులోకి వచ్చింది. 31 సర్జన్ డాక్టర్ చంద్ర విభాస్ సాహు తన భార్య సుప్రియా తుషార్‌ను దుపట్టాతో ఉరేసి గత శుక్రవారం చంపాడు. ఆ వైద్యుడు మాస్టర్స్ కోర్సులో బ్యాచ్ టాపర్ కాగా, సుప్రియ తుషార్ ఎంబిఎ గ్రాడ్యుయేట్. భార్యను చంపిన తర్వాత ఆమె శవాన్ని కారులో వేయి కిలోమీటర్ల దూరం తీసుకుని వెళ్లి అలహాబాద్ సమీపంలో గంగానదిలో పడేశాడు.

సాహు పశ్చిమ ఢిల్లీలోని డిడియు ఆస్పత్రిలో సీనియర్ రెసిడెంట్ డాక్టర్. 27 ఏళ్ల సుప్రియ తుషార్ హైదరాబాదులో బిటెక్ చేసి, ఆ తర్వాత రాజస్థాన్‌లో ఎంబిఎ పూర్తి చేసింది. సుప్రియకు ఇటీవలే ఓ ప్రముఖ ఐటి సంస్థ నుంచి 85 వేల రూపాయల జాబ్ ఆఫర్ వచ్చింది. వీరిద్దరు కూడా జార్ఖండ్‌కు చెందినవారు. సాహును పోలీసులు సోమవారం అరెస్టు చేశారు. తన భార్యతో తనకు మానసికంగా, శారీరకంగా పొత్తు కుదరలేదని సాహు పోలీసులకు చెప్పినట్లు సమాచారం.

గంగలో పడేయడం వల్ల శవం కొట్టుకుపోతుందని సాహు భావించినట్లున్నాడు. అయితే, ప్రవాహం తక్కువగా ఉండడంతో కొట్టుకుపోలేదు. ఉత్తరప్రదేశ్ పోలీసులు శవాన్ని కనిపెట్టి స్వాధీనం చేసుకున్నారు. వారిద్దరికి పది నెలల క్రితమే వివాహమైంది. సాహు సుప్రియను మొదటి నుంచీ వేధిస్తున్నట్లు చెబుతున్నారు. సుప్రియ పోలీసులకు ఫిర్యాదు చేసింది కూడా. ఆమెను 2011లో సాహు ఇంటి నుంచి వెళ్లగొట్టాడు. జులైలో తిరిగి వచ్చిన తర్వాత వారం రోజుల పాటు ఆమెను మెంటల్ ఆస్పత్రిలో కూడా చేర్చాడు. ఆమె పిచ్చిదని నిరూపించడానికి సాహూ ఈ పని చేసినట్లు ఆరోపిస్తున్నారు.

English summary
A 31-year-old surgeon, who was the batch topper in the masters course, strangled his MBA wife with a dupatta in their west Delhi house last Friday night, put the body in his car and travelled more than 1,000km before dumping it in the Ganga near Allahabad.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X