భార్యను చంపి గంగానదిలో శవాన్ని పడేసిన డాక్టర్
సాహు పశ్చిమ ఢిల్లీలోని డిడియు ఆస్పత్రిలో సీనియర్ రెసిడెంట్ డాక్టర్. 27 ఏళ్ల సుప్రియ తుషార్ హైదరాబాదులో బిటెక్ చేసి, ఆ తర్వాత రాజస్థాన్లో ఎంబిఎ పూర్తి చేసింది. సుప్రియకు ఇటీవలే ఓ ప్రముఖ ఐటి సంస్థ నుంచి 85 వేల రూపాయల జాబ్ ఆఫర్ వచ్చింది. వీరిద్దరు కూడా జార్ఖండ్కు చెందినవారు. సాహును పోలీసులు సోమవారం అరెస్టు చేశారు. తన భార్యతో తనకు మానసికంగా, శారీరకంగా పొత్తు కుదరలేదని సాహు పోలీసులకు చెప్పినట్లు సమాచారం.
గంగలో పడేయడం వల్ల శవం కొట్టుకుపోతుందని సాహు భావించినట్లున్నాడు. అయితే, ప్రవాహం తక్కువగా ఉండడంతో కొట్టుకుపోలేదు. ఉత్తరప్రదేశ్ పోలీసులు శవాన్ని కనిపెట్టి స్వాధీనం చేసుకున్నారు. వారిద్దరికి పది నెలల క్రితమే వివాహమైంది. సాహు సుప్రియను మొదటి నుంచీ వేధిస్తున్నట్లు చెబుతున్నారు. సుప్రియ పోలీసులకు ఫిర్యాదు చేసింది కూడా. ఆమెను 2011లో సాహు ఇంటి నుంచి వెళ్లగొట్టాడు. జులైలో తిరిగి వచ్చిన తర్వాత వారం రోజుల పాటు ఆమెను మెంటల్ ఆస్పత్రిలో కూడా చేర్చాడు. ఆమె పిచ్చిదని నిరూపించడానికి సాహూ ఈ పని చేసినట్లు ఆరోపిస్తున్నారు.