బెజవాడ దీక్షపై లగడపాటి వర్సెస్ వైయస్ జగన్

అయితే లగడపాటి విజ్ఞప్తిని వైయస్సార్సీ పార్టీ నేతలు తోసిపుచ్చుతున్నట్టుగా తెలుస్తోంది. జగన్ దీక్ష వేదిక మార్చే ప్రసక్తే లేదని చెబుతున్నారు. దీక్షకు మరో రోజు మాత్రమే మిగిలి ఉన్న సమయంలో లగడపాటి దీక్షను మార్చుకోవాలని కోరటం, వైయస్సార్సీ పార్టీ నేతలు ససేమీరా అనడంతో విజయవాడ రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. ఇరు ప్రాంతాలు తమ బలాబలాలు నిరూపించుకునే ప్రయత్నాలు చేస్తున్నాయి. జగన్ దీక్షా శిబిరానికి భారీగా జనాలను తరలించే ప్రయత్నాలను వైయస్సార్సీ పార్టీ చేస్తుండగా, దానిని అడ్డుకునే ప్రయత్నంలో లగడపాటి అనుచరులు ఉన్నట్టుగా తెలుస్తోంది. కాగా కృష్ణా జిల్లాలో జగన్ ఓదార్పు చేపడుతున్న విషయం తెలిసిందే. అంతకుముందు లగడపాటి జగన్పై నిప్పులు చెరిగిన నేపథ్యంలోనే ఆయన తన ఓదార్పును కృష్ణా జిల్లాలో ప్రారంభించినట్లుగా వార్తలు వచ్చాయి. తాజాగా లగడపాటి ఇలాకాలో జగన్ దీక్ష చేస్తానని ప్రకటించడంతో దాన్ని అడ్డుకొని తన సత్తా చాటాలని ఎంపీ చూస్తున్నట్లుగా కనిపిస్తోంది.












Click it and Unblock the Notifications