ప్రత్యేక తెలంగాణతో సమస్యలు: ప్రణబ్ ముఖర్జీ

తెలంగాణ రాజకీయ ఐక్య కార్యాచరణ సమితి, తెలంగాణ ప్రాంత కాంగ్రెసు ప్రజా ప్రతినిధులు ఇటీవలె ఢిల్లీలో ముఖ్య నేతలను కలవడం, నిరవధికంగా జరుగుతున్న సకల జనుల సమ్మె కారణంగా తెలంగాణ అంశం జాతీయ స్థాయిలో మరోసారి వేడెక్కింది. తెలంగాణపై కాంగ్రెసు, తెలుగుదేశం, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ మినహా మిగిలిన పార్టీలు తమ అభిప్రాయాలు చెప్పాయి. భారతీయ జనతా పార్టీ, తెలంగాణ రాష్ట్ర సమితి, సిపిఐలు తెలంగాణకు అనుకూలంగా ఉండగా, సిపిఎం సమైక్యాంధ్రకే మొగ్గు చూపింది. అయితే రెండు ప్రాంతాలలో అధికారంలో ఉన్న కాంగ్రెసు పార్టీ వైఖరితో రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షమైన తెలుగుదేశం పార్టీ వైఖరిలో ఇప్పటి వరకు స్పష్టత లేదు. మంగళవారమే మీడియా సమావేశంలో టిడిపి చీఫ్ చంద్రబాబు మాట్లాడుతూ తెలంగాణపై తనది తటస్థ వైఖరి అని ప్రకటించారు. ఇక కాంగ్రెసు పార్టీ మరి కొన్ని రోజుల్లో వైఖరి ప్రకటించే అవకాశం ఉంది.












Click it and Unblock the Notifications