రాష్ట్రపతి పాలన ప్రసక్తే లేదు: ఆజాద్ స్పష్టీకరణ

తెలంగాణ సమస్యపై ఇది వరకు మాట్లాడనివారందరితో మాట్లాడుతున్నామని ఆయన అన్నారు. రాష్ట్రానికి చెందిన నలుగురు మంత్రులతో, ముఖ్యమంత్రితో, ఉప ముఖ్యమంత్రితో మాట్లాడామని ఆయన చెప్పారు. ఈ విస్తృత స్థాయి చర్చలు కొనసాగుతాయని ఆయన చెప్పారు. రాష్ట్రానికి చెందిన మూడు ప్రాంతాల ప్రజాప్రతినిధులతో చర్చలు పూర్తి చేశామని ఆయన అన్నారు. అందరి అభిప్రాయాలను తీసుకుంటున్నామని ఆయన అన్నారు. సమస్యను పరిష్కరించే దిశగానే చర్చలు సాగిస్తున్నామని ఆయన అన్నారు. మినీ కోర్ కమిటీతో మాట్లాడిన రాష్ట్రానికి చెందిన కేంద్ర మంత్రులు కూడా రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించే అంశం తమ వద్ద ప్రస్తావనకు రాలేదని చెప్పారు.












Click it and Unblock the Notifications